చనిపోయిన మహిళకు పింఛన్ ఇచ్చిన వాలంటీర్..!

విజయనగరం జిల్లాలో వాలంటీర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఏకంగా చనిపోయిన మహిళకు పింఛన్ అందించాడు. జిల్లాలోని గుర్ల మండలం గుర్ల గ్రామంలో ఇజ్జిరోతు త్రీనాథ్ అనే వ్యక్తి వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఎర్ర నారాయణ అనే మహిళ మరణించింది. 

అయితే ఆ వాలంటీర్ చనిపోయిన మహిళ దగ్గర వేలిముద్ర తీసుకుని ఆమెకు పింఛన్ పంపిణీ చేశాడు. కాగా ఈ ఘటనపై జిల్లా డీఆర్డీఏ పీడీ సుబ్బారావు స్పందించారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి వేలిముద్రలు పనిచేయవని తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

Leave a Comment