ప్రస్తుతం సోషల్ మీడియాలో నీటి తొట్టెలో పులి స్నానం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కర్నాటకలోని కొడుగులో ఓ ఇంటి యజమాని పశువుల కోసం నీళ్ల తొట్టి ఏర్పాటు చేశాడు. అయితే ఆ పరిసరప ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి అటువైపుగా వచ్చింది.
నీటి తొట్టి చుట్టూ తిరుగుతూ ఎవరైనా ఉన్నారా అని పరిశీలించింది. ఆ తర్వాత నీటి తొట్టెలో దిగి జలకాలాడటం ప్రారంభించింది. అంతే కాదు ఎవరైనా వస్తే పారిపోయేందుకు సిద్ధంగా ముందు కాళ్లను రెడీగా పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజిన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
What an unusual occurrence. Apparently in Coorg. Received from a friend on WhatsApp. pic.twitter.com/C7yEF6fjAW
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 7, 2020