అసలు సినిమా చూసి ఏమవుతాడో?

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సారి తనదైన స్టైల్ లో కామెంట్స్ చేశారు. ‘ జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభవజ్ఞడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికిపోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే’ అంటూ ట్విట్ చేశారు. 

ఇక మరో ట్విట్ లో ‘సున్నా వడ్డీ సొమ్ము ఇకపై నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపిస్తోంది జగన్ గారి ప్రభుత్వం. చంద్రబాబు నాడుడు పెట్టిన బకాయిలను సైతం చెల్లిస్తూ పెద్ద మనసు చుటుకుంటున్నారు. పంటల కొనుగోలు బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇది ముమ్మాటికీ రైతు ప్రభుత్వం. రైతులను దగా చేసిన వారు రైతుదగా దినోత్సవమంటున్నారు’ అంటూ ట్విట్ చేశారు.  

Leave a Comment