బయటకొచ్చి మాట్లాడు చిట్టీ..

అమరావతి : టీడీపీ నేత నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఆయన ఎమ్మెల్సీ పదవి త్వరలోనే పోతుందని అన్నారు. ఆయన తండ్రి చంద్రబాబు అధికారం కూడా పోయిందని ట్విట్ చేశారు. ‘తండ్రి అధికారం పోయింది. ఎమ్మెల్సీ పదవి రేపోమాపో ఊడుతుంది. ఇంకో పక్క అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్(Psychopath)లా మారిపోయాడు. చీకట్లో కూర్చుని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నాడు. బయటకొచ్చి మాట్లాడు చిట్టీ, నీ కామెడీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

 

Leave a Comment