నాని ఫ్యాన్స్ కు షాక్..‘వి’ సినిమా వాయిదా..

కరోనా వైరస్ ఎఫెక్ట్ నాని సినిమాపై పడింది. హీరోలు నాని, సుధీర్ బాబులు కలిసి నటించిన ‘వి’ సినిమా విడుదల వాయిదా పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో సినిమాను వాయిదా వస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరి కథానాయికలుగా నటించారు. 

ఈ సినిమా ఈనెల 25న విడుదల కావాల్సి ఉండగా… ఏప్రిల్ లో విడుదల చేస్తున్నట్లు  వెంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా థియేటర్లు, స్కూళ్లను బంద్ చేయనున్నారు. 

థియేటర్ల నిలిపివేతపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సమావేశమైంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశిస్తే..థియేటర్లు మూసివేస్తామని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మురళీ మోహన్ తెలిపారు. కరోనాపై రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అలర్డ్ ప్రకటించారు. అలాగే ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దని, తగిన జాగ్రత్తలు, సూచనలు పాటించాలని పేర్కొన్నారు. 

Leave a Comment