పరీక్షలు లేకుండానే పై తరగతికి..

కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించలేం – మంత్రి సురేష్

6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు అవకాశం

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించలేమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 

అయితే ఈనెల 31న జరిగే సమీక్ష తరువాత పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. దీనిపై విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని సూచించారు. కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూతపడి ఉన్నందున పిల్లలకు నేరుగా వారి ఇళ్లకే మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. వలంటీర్ల ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. 

Leave a Comment