పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం హత్యకు గురయ్యాడు..!

ఒకప్పుడు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకునే వారు. అయితే ఈ రోజుల్లో ఒక పెళ్లి చేసుకుంటే గొప్పగా మారింది. అయితే ఈ వ్యక్తి ఏకంగా పది పెళ్లిళ్లు చేసుకున్నాడు. చివరికి ఆస్తి కోసం దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో బుధవారం చోటుచేసుకుంది. 

వివరాల మేరకు బరేలీ జిల్లాకు చెందిన జగన్ లాల్ యాదవ్(52) అనే రైతు 1990 నుంచి ఇప్పటి వరకు 10 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పది మందిలో ఐదుగురు భార్యలు చనిపోయారు. మరో ముగ్గురు వేరే వారిలో లేచిపోయారు. ప్రస్తుతం జగన్ లాల్ ఇద్దరు భార్యలతో ఉంటున్నాడు. బుధవారం గ్రామానికి దగ్గరలోని పంట పొలంలో జగన్ లాల్ శవమై కనిపించాడు. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి కోసమే జగన్ లాల్ ను చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, పది పెళ్లిళ్లు చేసుకున్నా జగన్ లాల్ కు పిల్లలు లేరు.. తన భార్య మొదటి భర్త కుమారుడితోనే ఉంటున్నాడు. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నందుకు జగన్ లాల్ తండ్రి ఆస్తిని అతడి అన్నకు రాసిచ్చాడు. అయితే జగన్ లాల్ పంచాయతీలో గెలిచి కొంత భూమిని దక్కించుకున్నాడు.  

Leave a Comment