మొబైల్ గేమ్ ఆడొద్దని చెప్పినందుకు.. కన్నతల్లినే చంపిన కొడుకు..!

ఈరోజుల్లో పిల్లలు మొబైల్ గేమ్స్ కి .. ఎంత అలవాటు పడ్డారంటే.. చేతిలో మొబైల్ లేనిదే వారికి రోజు గడవడం లేదు. ఇటీవల మొబైల్ గేమ్ కి అలవాటు పడిన ఓ యువకుడు ఏకంగా తల్లినే చంపేశాడు.. మొబైల్ గేమ్ ఆడకుండా అడ్డుకున్నందుకు ఆమెన గన్ తో కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. చంపిన తర్వాత తల్లిని ఇంట్లోని ఓ గదిలో దాచాడు. 

ఈ విషయం ఎవరీకీ చెప్పొద్దని.. చెబితే చంపేస్తానని తన చెల్లెలి ని బెదిరించాడు. అలా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి రెండు రోజులు గడిపాడు. జూన్ 7న రాత్రి 9గం. సమయంలో దీనిపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఫోరెన్సిక్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. ప్రాథమిక దర్యాప్తులో బాలుడే తన తల్లిని హత్య చేసినట్లు తేలింది.

మొదట్లో తమ ఇంటికి వచ్చిపోయే ఓ ఎలక్ట్రిషీయనే ఈ హత్యకు పాల్పడినట్లు బాలుడు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో బాలుడు నేరం అంగీకరించాడు. ఇంట్లో మృతదేహం ఉన్న రెండు రోజుల పాటు చెల్లెలికి బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చాడని.. ఇంట్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు రూమ్ ఫ్రెష్‌నర్ స్ప్రే చేశాడని పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. 

 

Leave a Comment