అప్పటి వరకు HD క్వాలిటీ లేనట్లే..

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మరో వైపు థియేటర్లు, మాల్స్ సైతం మూతపడ్డాయి. దీంతో ఇంటర్నెట్ వాడకం దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రధాని మోడీ 21 రోొజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకంచారు. ఈ నేపథ్యంలో డిజిటల్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. 

దిగ్గజ ఆన్ లైన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, ఎంఎక్స్ ప్లేయర్, టిక్ టాక్, నెల్ ప్లిక్స్ వంటి యాప్స్ లో HD, అల్ట్రా HD వీడియో ప్రసారాలను తాత్కాలికంగా ఎస్ డిలో మాత్రమే అందించాలని ఆయా సంస్థలు నిర్ణయించుకున్నాయి. దీని వల్ల ఏప్రిల్ 14 వరకు మొబైల్ నెట్ వర్కులో 480p మాత్రమే స్ట్రీమింగ్ అవుతాయి. నెట్ వర్క్ సమస్య ఏర్పడకుండా వర్క్ ఫ్రమ్ హోం చేసే వారికి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Leave a Comment