రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు..!

తెలంగాణలోని చారిత్రక రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకుంది. ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. తాజాగా యునెస్కో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు నెలకొల్పింది. 

రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల క్రితం దీనిని కాకతీయులు నిర్మించారు. పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం ఉంది. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ.1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. కన్నార్పకుండా చేసే శిల్పాలు, అరుదైన ఎరుపురాతి నిర్మాణాలు, నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణం వంటి ప్రత్యేకతలు రామప్ప ఆలయానికి ఉన్నాయి. 

Leave a Comment