ఉగాది పంచాంగం : 2028 వరకు మోడీకి తిరుగులేదు..!

హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేశారు. ప్రధాని మోడీకి 2028 మే 5 వరకు తిరుగులేదని సిద్ధాంతి మహేశ్వర శర్మ స్పష్టం చేశారు.  మోడీ మూడో సారి ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తారని, ప్రధాని నిర్ణయాలను దేశ ప్రజలు సమర్థిస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆహార ధాన్యాలకు లోటు ఉండదని, అయితే వరదలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 

అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. పేద ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధమన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా ముందుకు పోతుందన్నారు. మోడీకి దేశ ప్రజలు అండగా ఉండాలని బండి సంజయ్ కోరారు.. 

 

Leave a Comment