తల్లి ప్రేమకు కరిగి.. లొంగిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు..!

తల్లిదండ్రులకు ప్రేమకు ఇద్దరు ఉగ్రవాదులు కరిగిపోయారు.. ఆయుధాలు విడిచి పోలీసుల ముందు లొంగిపోయారు.. ఈ ఆసక్తికర పరిణామం జమ్మూ-కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో భద్రతా బలగాలు యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఓ ఇంట్లో ఇద్దరు ముష్కరులు నక్కీ ఉన్నారని గుర్తించాయి. 

ఈ విషయాన్ని ఆ ఉగ్రవాదుల తల్లిదండ్రులకు బలగాలు చేరవేశాయి.. వారు లొంగిపోయేలా చేసేందుకు ప్రయత్నించాయి. తల్లిదండ్రులు ఆ ముష్కరులను బతిమాలారు. దీంతో కరిగిపోయిన ఇద్దరు పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసులు వారి నుంచి ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఇద్దరు ముష్కరులు కూడా ఇటీవలే ఉగ్రవాద సంస్థల్లో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్ కౌంటర్ చేయకుండా ఇద్దరి ప్రాణాలు కాపాడినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదం వైపు వెళ్లవద్దని, హింసా మార్గానికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలని ఆయన కోరారు. తల్లిదండ్రులు సహకరిస్తే.. వందల మంది ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు. 

 

Leave a Comment