ఇద్దరు ఆటగాళ్లకు కరోనా.. నేటి మ్యాచ్ వాయిదా..!

ఐపీఎల్ లో కరోనా కలకలం రేపింది. కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో సోమవారం రాత్రి జరగాల్సిన ఆర్సీబీ, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వాయిదా వేశారు.  

కేకేఆర్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆర్సీబీ ఈ మ్యాచ్ ఆడటానికి సుముఖంగా లేదని బీసీసీఐ అధికారి ఒకరు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వెల్లడించారు. ఈ మ్యాచ్ ను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. 

కాగా, లీగ్ ప్రారంభానికి ముందు కూడా ఢిల్లీ ప్లేయర్స్ అక్షర్ పటేల్, కేకేఆర్ కు చెందిన నితీస్ రాణా కూడా కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కూడా పలువురు గ్రౌండ్ సిబ్బందికి కరోనా సోకింది. అయితే టోర్నీకి ముందే ప్లేయర్స్ కు నెగటివ్ గా తేలడంతో లీగ్ సజావుగా సాగుతోంది. ప్రస్తుతం ప్లేయర్స్ అంతా కఠినమైన బయోబబుల్ లో ఉంటున్నారు. అయితే ఈ ఇద్దరు ప్లేయర్స్ తమ గాయాలకు స్కానింగ్ కోసం వెళ్లినప్పుడు కరోనా బారిన పడి ఉంటారని అనుమానిస్తున్నారు. 

Leave a Comment