విషాదం : ప్రేమ జంట బలవన్మరణం..

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఆర్మూర్ మండలం పెర్కిట్ లో ఈ ఘటన జరిగింది. వేల్పూరు మండలం కుకునూర్ కు చెందిన రోహిత్, అవంతిక గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. 

ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి పెళ్లికి ఇరువురి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆ జంట పెర్కిట్ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment