ఎస్సైని చితకబాదిన ముగ్గురు యువకులు..!

రూల్స్ బ్రేక్ చేస్తే ప్రశ్నించిన ఎస్సైనే చితకబాదారు ముగ్గురు యువకులు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పాచిపెంట ఎస్సై రమణ సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. ఖడ్గవలస వద్ద ముగ్గురు యువకులు బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేయడంతో పాటు వేగంగా వెళ్తుండటంతో ఎస్సై వారిని వారించారు.

దీంతో ఆ ముగ్గురు యువకులు ఎస్సైపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో ఎస్సైకు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన షర్ట్ కూడా పూర్తిగా చిరిగిపోయింది. పోలీస్ అధికారిపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

Leave a Comment