శ్రీరాముడి దేశంలో ఇదీ పరిస్థితి.. బీజేపీ ఎంపీ సంచలన ట్వీట్..!

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో డీజిల్ పై రూ.4, పెట్రోల్ పై 2.5 రూపాయల సెస్ విధించింది. అంతే కాదు దేశంలో పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలపై ఆయన స్పందించారు. 

పెట్రోల్, డీజిల్ ధరలను ఆయన పొరుగు దేశాల ధరలతో పోల్చుతూ ఓ పోస్టు చేశారు. ‘శ్రీరాముడి భారతదేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.93, సీత దేశమైన నేపాల్ లో రూ.53, రావణ దేశం శ్రీలంకలో పెట్రోల్ లీటర్ రూ.51’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment