‘జగన్ సింహం కాదు పిల్లి.. 2024 తర్వాత వైసీపీ ఉండదు’ : చంద్రబాబు 

రాష్ట్ర ప్రజల్లో జగన్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసమర్థ ప్రభుత్వ పాలనతో విసిగిపోయి ఉన్నారన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న విషయం స్పష్టం అయ్యిందన్నారు. 2024లో ఓడిపోతే వైసీపీ అనేది ఉండదని జగన్ కు పూర్తిగా అర్థం అయ్యిందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, జగన్ పోకడలను చూస్తే 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలు అవనున్నాయని  అన్నారు.

నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ముఖ్యనేతలు, మండల, డివిజన్ అధ్యక్షులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ తాను పులి అని చెప్పుకుంటారని…కానీ జగన్ పిల్లి అంటూ చంద్రబాబు అన్నారు. పిల్లి కాబట్టే భయంతో జగన్ అందరి కాళ్లూ పట్టుకుంటారని వ్యాఖ్యానించారు.

ఇకపోతే వైసీపీ తన బలహీనతలను అధిగమించడానకి డైవర్షన్ పాలిటిక్స్ ను ఎప్పుడూ అమలు చేస్తుందని చంద్రబాబు అన్నారు. భీమిలి పర్యటనలో ప్రజలు ‘జై బాబు’ అన్న స్లోగన్స్ ను ‘జై జగన్’ అన్నట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేసిన విధానాన్ని ప్రస్తావించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలి అన్న తన వ్యాఖ్యలను…. పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని అన్నారు.

 

Leave a Comment