ట్రాఫిక్ జామ్ తో నిండు ప్రాణం బలి..!

ట్రాఫిక్ జామ్ ఓ నిండు ప్రాణం తీసింది. కేవలం 500 మీటర్ల దూరం దాటేందుకు 20 నిమిషాలు పట్టింది. దీంతో ఓ యువకుడు అంబులెన్స్ లోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. మహారాష్ట్ర హౌసింగ్ బోర్డు కాలనీలో అల్ జిగ్నేష్ పర్ మర్(27) అనే యువకుడు తన తల్లిదండ్రులతో ఉంటున్నాడు. 

జిగ్నేష్ కు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో గుండె నొప్పి వచ్చింది. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆ ఆస్పత్రిలో అత్యవసరమైన పరికరాలు లేవు. దీంతో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆ యువకుడన్ని అంబులెన్స్ లో తీసుకొస్తుండగా.. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్ లో కేవలం 500 మీటర్ల దూరాన్ని దాటేందుకు 20 నిమిషాలు పట్టింది. దీంతో జిగ్నేష్ అంబులెన్న్ లోనే ప్రాణాలు వదిలాడు. 

Leave a Comment