‘శుభలగ్నం’ సీన్ రిపీట్.. రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసింది..!

మీకు 1990లలో వచ్చిన శుభలగ్నం సినిమా గుర్తుందా.. ఆ సినిమాలో జగపతిబాబును రోజాకు కోటి రూపాయలకు అమ్మేస్తుంది ఆమని.. తాజాగా రూ.1.5 కోట్లకు భర్తను మరో మహిళకు అమ్మేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో సంచలనంగా మారింది. వివరాల మేరకు తన తండ్రి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ తన తల్లితో గొడవ పడుతున్నాడంటూ ఓ బాలిక భోపాల్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేసింది.

వీరిద్దరి గొడవల వల్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని తెలిపారు. దీని వల్ల తాను. తన చెల్లెలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసును భోపాల్ ఫ్యామిలీ కోర్డుకు తరలించారు. దీంతో కోర్టు బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ కౌన్సిలింగ్ లో బాలిక తండ్రికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. 

అతను తన ప్రియురాలితోనే ఉండాలని భావిస్తున్నట్లు చెప్పాడు. తనకు విడాకులు కావాలని కోరాడు. దీనికి భార్య మొదట అంగీకరించలేదు. ఆ తర్వాత ఓ షరతుపై విడాకులకు అంగీకరించింది. తన భర్తతో ఉండాలంటే తనకు ఇల్లు, 1.5 కోట్ల రూపాయల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి తన భర్త ప్రియురాలు అంగీకరించింది. బిడ్డల భవిష్యత్తు కోసం డబ్బులు డిమాండ్ చేశానని అతని భార్య చెప్పుకొచ్చింది.   

 

Leave a Comment