మా గ్రామంలో రాజకీయ నాయకులకు అనుమతి లేదు.. ఓట్ల కోసం రావొద్దని ఫ్లెక్సీలు..

ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని రెండు ఆవాస గ్రామాలు రాజకీయ నేతలు తమ గ్రామాలకు రావొద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని గగ్గినపల్లివారిగూడెం, కమ్మరిగూడెం ప్రజలు ఈ ఫ్లెక్సీలు పెట్టారు. 

ఈ గ్రామాలు వేంపాడ్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నాయి. వేంపాడ్ ప్రధాన రహదారి వెంటక ఆదివారం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘మా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు.. మా గ్రామంలోకి ఏ రాజకీయ నాయకునికి అనుమతి లేదు. ఓట్ల కోసం మా ఊరికి రావొద్దు’ అంటూ ఫ్లెక్సీలు పెట్టి నిరసన తెలిపారు. ఈ గ్రామాలు ఉప ఎన్నిక జరుగనున్న నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో గ్రామస్తుల నిరసనకు ప్రాధాన్యం ఏర్పడింది.  

 

Leave a Comment