గుడ్ న్యూస్ : ఐపీఎల్ 2020కి వేదిక ఖరారు..!

క్రికెట్ దీనికున్న క్రేజే వేరు. అందులోనూ ఐపీఎల్ అంటే దానికున్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లేనట్టే అని అంతా అనుకున్నారు. కాని బీసీసీఐ మాత్రం ఐపీఎల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలని భావిస్తోంది.  

అక్టోబర్-నవంబర్ లో దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2020 జరగనుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కూడా స్పష్టం చేశారు. ఈ మెగా టోర్ని షెడ్యూల్ గురించి పాలక మండలి సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరనుందని ఆయన పేర్కొన్నారు. 

ఇండియాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ ఇక్కడ నిర్వహించడం అసాధ్యం. ఇలాంటి సమయంలో యూఏఈ ప్రభుత్వం నుంచి బీసీసీఐకి ప్రతిపాదన వచ్చింది. ఐపీఎల్ తమ దేశంలో నిర్వహించుకునేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తామని, కరోనా నుంచి కూడా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో బీసీసీఐ అక్కడ టోర్నీ నిర్వహించేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. 

Leave a Comment