ఏటీఎం మెషిన్ నే ఎత్తుకెళ్లిన దొంగలు..!

ఆదిలాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎం మెషిన్ నే ఎత్తుకెళ్లిపోయారు. కలెక్టరేట్ చౌరస్తాలోలోని ఏటీఎంను తాళ్లతో కట్టి వాహనంలో తీసుకెళ్లారు. క్యాష్ బాక్స్ ను ధ్వంసం చేసి నగదును దొంగలించారు. సావర్గమ్ ప్రాంతంలో ఏటీఎం మెషిన్ ను పడేశారు. ముందుగా స్థానిక సోనార్ బజార్ ప్రాంతంలో నగల దుకాణంలో దొంగతనానికి ప్రయత్నం చేశారు. 

అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అక్కడి నుంచి కలెక్టర్ చౌరస్తాలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. తాళ్లతో కట్టి టవేరా వాహనంలో ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లారు. నిందితులను అంతర్ రాష్ట్ర దొంగలుగా పోలీసులు గుర్తించారు. నిందుతుల ఆచూకీ కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఏటీఎంలో దాదాపు 25 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు సమాచారం. 

Leave a Comment