ఏపీ ప్రభుత్వానికి సుప్రీం షాక్.. రంగులు తొలగించాలని తీర్పు..

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడి ధర్మాసనం కొట్టివేసింది. నాలుగు వారాల్లో పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులను తొలగించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. 

 

Leave a Comment