అమ్మ.. నాన్న.. దేవుడి దగ్గరికి వెళ్లున్నా.. లేటర్ రాసి కనిపించని విద్యార్థి..

చిత్తూరు జిల్లాలో మానసిక వైకల్యం వికటాట్టహాసం చేస్తోంది. మూడు రోజుల క్రితం కన్న కూతుర్లను చేజేతుల చంపేసుకున్న ఘటన చోటుచేసుకోగా.. తాజాగా ఓ యువకుడి వ్యవహార శైలీ తమ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు దేవుడి దగ్గరకు వెళ్తున్నాని లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. 

గంగవరం మండలం మాజేపల్లేకు చెందిన శిశ శంకర్, పద్మజ దంపతులకు గణేష్ పెద్ద కొడుకు. మండల కేంద్రానికి సమీపంలోని కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. ఈనెల 21న రాత్రి నోట్ బుక్ లో రెండు పేజీల లేఖ రాసి కనిపించకుండా పోయాడు. బైక్, మొబైల్, కాలేజీ బ్యాగ్ కూడా కనిపించడం లేదు.

 ‘నాన్న నన్ను క్షమించండి. నేను దేవుడి దగ్గరకు వెళ్లిపోతున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపులోనే పుట్టాలని ఉంది. అమ్మా నా కోసం ఎంత ఏడ్చినా నేను ఎక్కడా ఆనందంగా ఉండలేను. నేను అసలు పుట్టనేలేదనుకో.. తమ్ముడు జాగ్రత్త. మీకు తలవంపులు తెచ్చింటే క్షమించండి.’ అంటూ లేఖలో రాసుకొచ్చాడు.

తల్లిదండ్రులు గణేష్ కోసం అన్ని ప్రాంతాల్లోను వెతుకుతున్నారు. మదనపల్లె ఘటన నేపథ్యంలో తన బిడ్డకు ఎం జరగకూడదని వారు ప్రార్థిస్తున్నారు. యువకుడిలో భక్తిభావం ఎక్కువగా ఉందని, కాని అది మూఢత్వం స్థాయిలో లేదని బంధువులు చెబుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.  

Leave a Comment