రెండు రాష్ట్రాల మధ్య వింత రైల్వే స్టేషన్..

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఒక వింత రైల్వే స్టేషన్ ఫొటోను ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. ఈ ఫొటో నవాపూర్ రైల్వే స్టేషన్ ది. ఇందులో వింత ఏమిటంటే..ఈ రైల్వే స్టేషన్ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఈ స్టేషన్ లో సగ భాగం గుజరాత్ లో, మరో సగ భాగం మహారాష్ట్రలో ఉంది. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఈ రైల్వే స్టేషన్ సూరత్-భూసావల్ రైల్వే మార్గంలో ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులు ఈ స్టేషన్ మధ్య నుంచి వెళ్తున్నాయన్నారు. దీంతో ఈ స్టేషన్ సగం గుజరాత్ లోనూ, సగం మహారాష్ట్రలోనూ ఉందంటూ తెలిపారు.  

Leave a Comment