‘నేను పంది మాంసం తింటా’..!

ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసనా ‘యువర్ లైఫ్’ అనే వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ వెబ్ సైట్ ద్వారా ఉపాసనా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా హీరోయిన్లను తీసుకొచ్చి వారికి నచ్చిన ఆరోగ్యకరమైన వంటను చేయిస్తోంది. ఈనేపథ్యంలో హీరోయిన్ రష్మికా తనకు నచ్చిన ఆహారం ‘కోలి పుట్టు’ అనే వంటకాన్ని వండింది. 

ఈ సందర్భంగా రష్మికకు ఉపాసనా కొన్ని ప్రశ్నలు అడిగింది. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా అని, మీరు పంది మాంసం బాగా తింటారు కదా అని ప్రశ్నలు వేసింది. ఈ ప్రశ్నలకు రష్మిక సమాధానం చెబుతూ అవును తాను పంది మాంసం ఇష్టంగా తింటానని, దానితో పాటు రెండు గ్లాసుల వైన్ ఉంటే ఇక స్వర్గమేనంటూ చెప్పింది. తాము ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటామని, నిద్రపోయే ముందు రెండు కప్పుల వైన్ తాగితే హాయిగా నిద్ర పడుతుందని తన ఆహార అలవాట్ల గురించి చెప్పింది.     

Leave a Comment