దేశరాజధాని ఢిల్లీలో చూడండి.. ఎంత తేడా ఉందో..!

ఒక వైపు కుప్పలు తెప్పలుగా ఎత్తయిన భవనాలు, మరో వైపు గుబురు చెట్లు, పచ్చదనంతో ప్రశాంత వాతావరణం.. ఇది ఒక్కడో విదేశాల్లో కాదండి.. మన దేశ రాజధాని ఢిల్లీలో… ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని పాలమ్ గావ్ ఏరియాలో ఎత్తయిన భవనాలను కుప్పలు, తెప్పలుగా కట్టేశారు. దీంతో అక్కడ పొల్యూషన్ ఏస్థాయిలో ఉంటుందో చెప్పనవసరం లేదు. 

అయితే దాని పక్కనే డిఫెన్స్ ఏరియా ఉంది. ఆ ఏరియా మాత్రం గుబురు చెట్లతో పచ్చదనంలో నిండి ఉంది. అక్కడ ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. ఈ రెండు ఏరియాల మధ్య తేడాను చూపిస్తూ తీసిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దీనిపై తెగ కామెంట్లు చేస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ ఇళ్లు నిర్మిస్తే అలా, లేకపోతే ఇలా అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు. 

Leave a Comment