9 ఏళ్ల బాలుడిపై ఆయా లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు శిక్ష వేసిన కోర్టు..!

ఈరోజుల్లో లైంగిక దాడులు ఎక్కువ అయిపోతున్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాడులు జరుగుతున్నాయి. ఎక్కువగా ఆడవాళ్ల పైన మగాళ్లు లైంగిక వేధిపులకు పాల్పడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా జరిగింది. ఓ వివాహిత 9 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడింది. ఈ కేసులో ఆ మహిళకు బాలమిత్ర కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు పాతబస్తిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో జ్యోతి అలియాస్ మంజుల అనే మహిళ ఆయాగా పనిచేస్తోంది. పాఠశాలకు చెందిన 9 ఏళ్ల బాలుడు బాత్ రూంకు వెళ్లాడు. ఇది గమనించిన ఆయా అతని వెంబడే బాత్ రూంలోకి వెళ్లింది. అక్కడ బాలుడి మర్మావయవాలను పట్టుకుని లైంగిక వేధించింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సిగరెట్ తో కాల్చింది. 

ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో వారు 2017 డిసెంబర్ లో చంద్రయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు.. విచారణ అనంతరం పాఠశాల ఆయా జ్యోతికి 20 ఏళ్ల జైలు శిక్షి, రూ.10 వేలు జరిమానా విధిస్తూ బాలమిత్ర కోర్టు ఈ గురువారం తీర్పు చెప్పింది.  

Leave a Comment