దారుణం.. ఆస్పత్రి బిల్లులు చెల్లించలేదని.. సర్జరీ చేసి కట్లు వేయలేదు.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి..!

ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు కాసులకు కక్కుర్తి పడి ఓ చిన్నారి మరణానికి కారణమయ్యారు. హాస్పిటల్ లో బిల్లులు పూర్తిగా చెల్లించలేదని మూడేళ్ల చిన్నారికి సర్జరీ చేసి కుట్లు వేయకుండా కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కౌశాంభి జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు మన్ ఝూన్ పూర్ పట్టణానికి చెందిన మూడేళ్ల చిన్నారికి కొద్ది రోజుల క్రితం కడుపులో నొప్పి వచ్చింది. దీంతో ఆమెను ప్రయాగ్ రాజ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పాపకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేశారు. అయితే చిన్నారి కుటుంబ సభ్యులు ఆస్పత్రి బిల్లులు మొత్తం కట్టలేదన్న కారణంతో సర్జరీ చేసిన చోట కుట్లు వేయకుండానే కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో పాప చనిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ వ్యక్తి టిట్టర్ లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. దీనిపై స్పందించిన జిల్లా వైద్యాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. 

Leave a Comment