ప్రపంచ దేశాలకు చైనా వార్నింగ్..!

ప్రపంచ దేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. విదేశీ శక్తులు తమను బెదిరించే ప్రయత్నం చేసినా లేక అనుచితంగా ప్రవర్తించినా.. వారి తలలు పగులుతాయని చెప్పారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిన్ పింగ్ మాట్లాడారు. అమెరికాను టార్గెట్ చూస్తూ కఠినంగా ప్రసంగించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెదిరింపులకు భయపడే రోజులు పోయాయన్నారు. చైనా పట్టుదలను ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, జాతి సమగ్రతను కాపాడుకునేందుకు చైనా ప్రజలు వెనుకడుగు వేయరన్నారు. తైవాన్ ఏకీకరణ విషయంలో తమల్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. చైనాపై బెదిరింపులను సాగనివ్వమని, తమపై ఎవరు ఒత్తిళ్లు తెచ్చినా.. వారికి సమాధానం చెబుతామని జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేస్తే వారి తలలు రక్తం చిందేలా చేస్తామన్నారు.

కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సంబరాల నేపథ్యంలో బీజింగ్ కళకళలాడింది. మిలిటరీ విమానాలతో ఫ్లై పాస్ట్ నిర్వహించారు. శతఘ్నలను పేలుస్తూ సెట్యూల్ నిర్వహించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. తయిమిన్ స్క్వేర్ లో జరిగిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మాస్క్ లు లేకుండా జనం కనిపించారు. 

Leave a Comment