నవవధువు ప్రాణాల మీదకు తెచ్చిన శోభనం..!

శోభనం ఓ నవవధువు ప్రాణాల మీదకు తెచ్చింది. శోభనం రాత్రి తనకు సహకరించడం లేదని భర్త అందరికీ చెప్పడంతో సిగ్గుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మడలం బొట్టుచెరువుకు చెందిన ఓ వ్యక్తి మేస్త్రీగా పనిచేసుకుంటూ హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పరిధిలోని ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నాడు.

ఆ వ్యక్తి పెద్ద కూతురుకు ఈనెల 6న స్వగ్రామంలో పెళ్లి జరిపించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం ఈనెల 9న శోభనం ఏర్పాటు చేశారు. అయితే కొత్తగా వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన యువతి మనసు తెలుసుకోకుండా తనకు సహకరించడం లేదని వరుడు పేచీ పెట్టాడు. పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు. 

యువతి శోభనానికి సహకరించడం లేదన్న విషయం అందరికీ తెలిసిపోయింది. దీంతో ఆమె ఆత్మన్యూనతకు గురైంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెను అర్థం చేసుకోకుండా ప్రశ్నించారు. దీంతో ఆ యువతి మనస్థాపానికి గురైంది. పెళ్లయి నాలుగు రోజులు తిరక్కుండానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునేందుక ప్రయత్నించింది. 

దీనిని గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. శోభనం రాత్రి జరిగిన గొడవ వల్లే తమ కూతురు ఆత్మహత్యాయత్నం చేసిందని వధువు తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.   

 

Leave a Comment