పెళ్లయిన గంటలోనే వరుడుకు షాక్.. వరుడి ముందే వధువుకు ముద్దు పెట్టిన ప్రియుడు..!

వరుడికి వధువు షాకిచ్చింది. పెళ్లయిన గంటలోనే తనకు పెళ్లయిందని ప్రియుడికి చెప్పడంతో అతను ముద్దుతో హంగామా చేశాడు. ఈ ఘటన కరీనగర్ జిల్లా హుజూరా బాద్ లో చర్చనీయాంశమైంది. 

హుజూరాబాద్ కు చెందిన యువతికి, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. యువతి పెళ్లికి ముందే వంశీ అనే యువకుడిని ప్రేమించింది. అయినా తల్లదండ్రులు మందమర్రికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు. 

పెళ్లి ఇష్టం లేని యువతి తనకు పెళ్లి అయిందని, అత్తారింటికి వెళ్తున్నానని వంశీకి కాల్ చేసి చెప్పింది. పెళ్లి తంతు ముగించుకుని వారు అత్తారింటికి బయలుదేరారు. అంతలో యువతి ఇచ్చిన సమాచారంతో ప్రియుడు వంశీ జమ్మికుంట రోడ్డులో వీరి వాహనాన్ని అడ్డుకున్నాడు. వారందరి ముందు వధువుకు ముద్దు పెట్టాడు. వధువును వదిలి పెట్టి వెళ్లాలని వారితో గొడవ చేశాడు. 

ఈ విషయంపై వరుడి తరపు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. అర్ధరాత్రి వరకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా వినకపోవడంతో వరుడు..వధువును పోలీస్ స్టేషన్ లోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఇటు వధువు తల్లిదండ్రులు సైతం ఆమెను వదిలి వెళ్లారు. ఈ గొడవకు కారణమైన వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Leave a Comment