సొంత ఇల్లు కోసం దాచుకున్న రూ.5 లక్షల నగదుకు చెదలు..!

సొంత ఇల్లు కట్టుకోవడం కోసం కష్టపడి రూ.5 లక్షలు కూడబెట్టాడు. ఆ కరెన్సీని ఎక్కడ దాచుకోవాలో తెలీక ఇంట్లోని ఓ ట్రంకు పెట్టేలో భద్రపరుచుకున్నాడు. అయితే ఆ డబ్బుకు చెదలు పట్టేశాయి. కష్టపడి సంపాదించిన రూ.5 లక్షలు చెదలపాలు కావడంతో ఇంట్లో వాళ్లు లబోదిబోమంటున్నారు. 

కృష్ణా జిల్లా మైలవరంకు చెందిన బిజిలి జమలయ్య విజయవాడ రోడ్డులోని వాటర్ ట్యాంక్ వద్ద పందుల వ్యాపారం చేస్తుంటాడు. జమలయ్యకు బ్యాంక్ అకౌంట్ లేదు. దీంతో తాను సంపాదించుకున్న డబ్బును ట్రంకు పెట్టేలో దాచుకున్నాడు. ఇలా మొత్తం రూ.5 లక్షలు కూడాబెట్టాడు. 

ఇంకా ఐదు లక్షల రూపాయాలు కలిపి సొంతిల్లు కట్టుకుందామనుకున్నాడు. ఈక్రమంలో అతనికి లక్ష రూపాయలు అవసరం ఏర్పడింది. దీంతో ట్రంకు పెట్టే తెరిచాడు. పెట్టేలోని నగదుకు చెదలు పట్టడం చూసి సొమ్మసిల్లి పడిపోయాడు.ఈ విషయం బయటికి పొక్కడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జమలయ్య వద్ద అంతా సొమ్ము ఎలా వచ్చిందంటూ ఆరా తీశారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు పోలీసుల ముందు కన్నీరు పెట్టుకున్నారు.  

Leave a Comment