యువకుడి వేధిపులకు టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య..!

ఓ యువకుడి వేధింపులకు టెన్త్ విద్యార్థిని బలైంది. అతడి వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని సౌమ్య పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించింది.  ఈ ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరులో జరిగింది.

 వర ప్రసాద్ అనే యువకుడు తనను వేధిపులకు గురిచేస్తున్నాడని, వరప్రసాద్ వేధింపుల వల్లే తాను చనిపోతున్నానని వీడియోలో చెప్పింది. అతడిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ కూతురి మరణానికి కారణమైన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమ్మాయి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

 

Leave a Comment