ఏపీ సీఎం జగన్ కోసం తెలంంగాణ యువకుడి పాదయాత్ర..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఏపీలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ జగన్ కు పాపులారిటీ ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా జగన్ ను అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. ఆయన సంక్షేమ పాలనను మెచ్చి జగన్ కోసం పాదయాత్రలు కూడా చేస్తున్నారు. తాజాగా జగన్ పై అభిమానంతో తెలంగాణకు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. జగన్ ను ఒక్కసారైన కలవాలని సంగారెడ్డి నుంచి తాడేపల్లి వరకు పాదయాత్ర చేస్తున్నాడు. 

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలం, మరియు గ్రామానికి చెందిన పబ్బు కిషోర్ అనే యువకుడు ఏపీ సీఎం జగన్ కు పెద్ద ఫ్యాన్. జగన్ ను ఒక్కసారైన కలవాలని ఈనెల 8న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పాదయాత్ర ప్రారంభించాడు. తన స్వగ్రామం నుంచి సీఎం జగన్ ను చూసేందుకు కాలినడకన బయలుదేరాడు. జగన్ ను కలిసే వరకు అక్కడే ఉంటానని, అక్కడి నుంచి రానని కిషోర్ చెబుతున్నాడు. 

Leave a Comment