20 ఏళ్ల తర్వాత ‘చిత్రం’ సీక్వెల్ ప్రకటించిన తేజ..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ట్రెండ్ సృష్టించిన దర్శకుడు తేజ. తేజ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా ‘చిత్రం’ రామోజీ రావు ప్రొడ్యుసర్ గా వచ్చిన ఈ సినిమా కొత్త నటీనగులతో, తక్కువ బడ్జెట్ తో తయారై సూపర్ హిట్ కొట్టింది. తేజకు ప్రతిభావంతుడైన దర్శకుడుగా గుర్తింపును తెచ్చింది. 

ఉదయ్ కిరణ్, రీమాసేన్, నితిన్, సదా, కాజల్, నవదీప్, సుమన్ శెట్టి వంటి నటీనటులతో పాటు ఆర్పి పట్నాయక్ వంటి సంగీత దర్శకులను కూడా పరిచయం చేశాడు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా 20 సంవత్సరాల క్రితం వచ్చిన ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు తేజ. 

‘చిత్రం 1.1’ పేరుతో రూపొందనున్న ఈ సినిమా 2021లోనే షూటింగ్ జరుపుకోనుంది. తొలి పార్ట్ కు సంగీతం అందించిన ఆర్పీ పట్నాయక్ ఇప్పుడు సీక్వెల్ కు సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. అయితే నటీనటులు ఎవరనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

Leave a Comment