టెస్టుల్లో నంబర్ 1గా టీమిండియా..!

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా రికార్డు నమోదు చేసింది. బ్రిస్బేన్ లో 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి టెస్టులో మరో 18 బంతులు మిగిలుండగానే చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా సిరీస్ కౌవసం చేసుకున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటింది. 

ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో అగ్రస్థానంలో నిలిచింది. గబ్బా టెస్టు విజయంతో 430 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కౌవసం చేసుకుంది. భారత్ తర్వాత న్యూజిలాండ్(420), ఆస్ట్రేలియా(332) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా(117.65) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్(118.44) మొదటి స్థానంలో కొనసాగుతోంది.   

Leave a Comment