టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ కి కవల పిల్లలు..!

టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ గుడ్ న్యూస్ చెప్పాడు. దినేష్ కార్తీక్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఈ విషయాన్ని దినేష్ కార్తీక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన భార్య దీపికా పల్లికల్ ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిందని వెల్లడించాడు. పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేర్లు పెట్టినట్లు పేర్కొన్నాడు. 

భార్య ఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను దినేష్ కార్తీక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘ముగ్గురం ఐదుగురం అయ్యాం’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. అయితే దినేష్ కార్తీక్ తన పెంపుడు కుక్కను కూడా కుటుంబంలో కలుపుకుని చెప్పడం విశేషం.. దినేష్ కార్తీక్ మరియు దీపిక పల్లికల్ 2015లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో మరియు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. దీపికా పల్లికల్ దేశంలోని ప్రముఖ స్క్వాష్ ప్లేయర్లలో ఒకరు.. కవలలు జన్మించడం వల్ల దినేష్ కార్తీక్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.     

Leave a Comment