‘అమెరికా ఎన్నికల్లో టీడీపీకి 503 సీట్లు’

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై చంద్రబాబు, నారా లోకేష్ లను ట్రోల్ చేస్తూ ట్వీట్లు చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు నారాలోకేష్ న్యూజెర్సీలో జరిగిన ఎన్నారై టీడీపీ సమావేశంలో మాట్లాడిన పేపర్ క్లిప్ ను ట్యాగ్ చేశారు. అమెరికాలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుందనిపిస్తోందని ఆ సమావేశంలో నారాలోకేష్ పేర్కొన్నారు. 

ఇప్పుడు అమెరికా ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. దీంతో అప్పటల్లో నారా లోకేష్ మాట్లాడిన మాటలపై విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 538 సీట్లకు టీడీపీకి 503 సీట్లు, డెమోక్రాట్లకు 20, రిపబ్లికన్స్ కు 15 సీట్లు వచ్చే అవకాశం..లగడపాటి సర్వే..’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇంకో ట్వీట్ లో ‘బ్రేకింగ్ న్యూస్.. చంబ్రాబుకు పోటాపోటీగా ట్రంప్, బైడెన్ ఫోన్లు. తమ ఎన్నికల కమిషన్ ను, సుప్రీం కోర్టును ఎలా మేనేజ్ చేయాలనే అంశంపై సంప్రతింపులు’ అంటే పేర్కొన్నారు. 

Leave a Comment