చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన తనికెళ్ల భరణి..!

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో శివునిపై కవితలు రాస్తూ పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఫేస్ బుక్ వేదికగా ‘శబ్బాష్ రా శంకరా’ అంటూ సీక్వెల్ ప్రారంభించారు. ఇందులో శివుడికి సంబంధించిన కొన్ని కవితలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన ఓ పోస్ట్ పై విమర్శలు వెలువడ్డాయి. 

ఇటీవల ‘గప్పాల్ గొడ్తరు గాడ్దె కొడుకులు, నువ్వుండంగ లేవంటరు.. ఉన్నవో లేవో చెవుల జెప్పిపోరా శబ్బాష్ రా శంకరా’ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై నెటిజన్లు తనికెళ్ల భరణిని ట్రోల్ చేశారు. హేతువాది బాబు గోగినేని కూడా తనికెళ్ల మాటలను ఖండించారు. ‘గాడిద కొడుకులు’ అని ఎవరైనా ఒళ్లు బలిస్తేనే రాస్తారు అంటూ మండిపడ్డారు.  

ఈక్రమంలో తనికెళ్ల భరణి అందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ‘ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన శబ్బాష్ రా శంకరా కవితలో దురదృష్టవశాత్తూ కొన్ని వ్యాక్యలు కొంత మంది మనసును నొప్పించడ, బాధ కలిగించడం జరిగింది. ఇక దానికి నేను వివరణ ఇచ్చుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఏం చెప్పినా కవరింగ్ లాగే ఉంటుంది.. కాబట్టి నేను చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా.. అలాగే ఆ పోస్టును డిలీట్ చేశా. నాకు హేతువాదులన్నా.. మానవతావాదులన్నా గౌరవమే తప్పితే వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషికీ ఇంకొకరిని నొప్పించే అధికారమే లేదు.. జరిగిన పొరపాటుకు మన్నించండి’ అని తనికెళ్ల భరణి కోరారు.  

 

Leave a Comment