18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు.. ధనుష్, ఐశ్వర్య విడాకులు..!

తమిళ స్టార్ హీరో ధనుష్, అతని భార్య రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు.  

Dhanush

సోషల్ మీడియాలో విడుల చేసిన లేఖలో ఏముందంటే.. ‘18 ఏళ్ల పాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాము. వ్యక్తిగతంగా సమయం వెచ్చించాలనుకుంటున్నాము. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం’ అంటూ ధనూష్ ట్విట్టర్ లో లేఖ విడుదల చేశారు. 

కాగా ధనుష్ కు, సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యకు 2004 నవంబర్ 18న పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. ఐశ్వర్య దర్శకత్వం వహించిన ‘3’ సినిమాలో ధనూష్, శ్రుతిహాసన్ జంటగా నటించారు. అప్పట్లో ధనుష్, శ్రుతి మధ్య ఏదో ఉందనే ప్రచారం తీవ్రంగా జరిగింది. దీంతో వీరి వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనైంది. తర్వాత అంతా సర్దుకుంది. ఇప్పుడేం జరిగిందో తెలియదు కానీ.. విడిపోతున్నట్లు ఇద్దరూ సోమవారం రాత్రి ప్రకటించారు.   

 

Leave a Comment