ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే కరోనా మహమ్మారి సమయంలో పెళ్లిళ్ల కోసం ప్రజలు వినూత్న పద్ధతులు అనుసరిస్తున్నారు. కొందరు చిన్న ఆత్మీయ వేడుకలను నిర్వహిస్తున్నారు. మరి కొందరు ‘ఆన్ లైన్ వెడ్డింగ్’(Online Wedding) పద్ధతిని ప్రయత్నిస్తున్నారు. వీడియో కాల్ లో ఆశీస్సులు తీసుకుంటున్నారు.
ఇదంతా సరే ..ఆన్ లైన్ లో పెళ్లి అంటే భోజనం సంగతి ఎలా? పెళ్లికి వచ్చిన వారికి భోజనం పెట్టడం కనీస మర్యాద కదా.. అందుకే తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. ఆహ్వాన పత్రికతో పాటు అచ్చమైన సంప్రదాయ పద్ధతిలో బుట్ట భోజనం, అరిటాకులు, 18 రకాల వంటకాలను పంపించారు.
మ్యారేజ్ వెబ్ కాస్ట్ వివరాలతో పాటు భోజనాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా వివరించే కార్డును కూడా పంపారు. హాయిగా పెళ్లి భోజనం చేస్తూ కంప్యూటర్ల ముందు కూర్చొని వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ వినూత్న ఆహ్వానాన్ని అందుకున్న శివానీ అనే నెటిజన్ దీనికి సంబంధించిన విశేషాలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
New trend of marriage invitation. Marriage food will be delivered at your doorstep. pic.twitter.com/ooEz1qbsvP
— Shivani (@Astro_Healer_Sh) December 10, 2020