T20 WorldCup 2021: అక్టోబర్ 17 నుంచి ఆరంభం..!

ఐసీపీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. యూఏఈతో పాటు ఒమన్ వేదికలుగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరుగనుంది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరిగిన నేపథ్యంలో వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సి వచ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ఈ టోర్నీ జరుగనుంది.

టోర్నీ మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్ లు జరుగుతాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం(అబుదాబి), షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ లో మ్యాచ్ లను నిర్వహించనున్నారు. టోర్నీ తొలి రౌండ్ లో అర్హత సాధించిన 8 జట్లు, రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒమన్, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్ లు సూపర్ 12 కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్ తో కలుస్తాయి.   

 

Leave a Comment