జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టు వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఉమేష్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. 

జూలైలో పరీక్షలు నిర్వహిస్తామి, 15 రోజుల ముందే షెడ్యూల్ ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే, దాని వల్ల ఒక్కరు మరణించినా, కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని ధర్మాసనం హెచ్చరించింది. 

పరీక్షల సమయంలో కోవిడ్ పెరిగితే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్కుల ఎవల్యూషన్ పై కూడా తాము నిపుణులతో మాట్లాడి ఒక చార్ట్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి గదిలో 15 నుంచి 18 మందికి పరీక్షలు నిర్వహిస్తే.. 34,634 గదులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. పరీక్షల తేదీలు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సేఫ్టీ అంశంపై ప్రణాళికలు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 

ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. అయితే 10, 12 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం, 11వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టకు తెలిపాయి. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రత్యామ్నాయం లేదని ఏపీ ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టులో పిటిషల్ దాఖలు చేసింది. 

Leave a Comment