చీరాల వాడరేవు వద్ద వింత చేప.. మూడు కళ్లతో రాయి ఆకారంలో..!

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరానికి వింత చేప కొట్టుకొచ్చింది. వింత చేపకు మూడు కళ్లు ఉన్నాయి. నీళ్లలో వేస్తే రబ్బర్ లాగా సాగుతోంది. చూడటానికి తెల్లగా రాయి ఆకారంలో మూడు కళ్లతో కేజీన్నర బరకు బరువు ఉంది. సముద్ర తీరంలో వింత చేప కనిపించడంతో మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. 

ముందుగా ఈ వింత చేపను చేసేందుకు మత్స్యకారులు భయపడ్డారు. ఆ తర్వాత ధైర్యం చేసి పట్టుకుని చేశారు. అయితే ఈ వింత చేప రబ్బరులా సాగుతోందని, ఇలాంటి చేపను తాము ఎప్పుడు చూడలేదని వారు చెబుతున్నారు. ఈ వింత చూపను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు వస్తున్నారు. ఇలాంటి వింత చేపను తామెన్నడూ చూడలేదని చీరాల మత్స్యశాఖ అధికారులు అంటున్నారు. 

 

  

Leave a Comment