అమరావతి : ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూల్..
మార్చి 23 | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 |
మార్చి 24 | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 |
మార్చి 26 | సెకండ్ లాంగ్వేజ్ |
మార్చి 27 | ఇంగ్లీష్ పేపర్-1 |
మార్చి 28 | ఇంగ్లీష్ పేపర్-2 |
మార్చి 30 | గణితం పేపర్-1 |
మార్చి 31 | గణితం పేపర్-2 |
ఏప్రిల్ 01 | సైన్స్ పేపర్-1 |
ఏప్రిల్ 03 | సైన్స్ పేపర్-2 |
ఏప్రిల్ 04 | సోషల్ స్టడీస్ పేపర్-1 |
ఏప్రిల్ 06 | సోషల్ స్టడీస్ పేపర్-2 |
ఏప్రిల్ 07 | శాన్ స్క్రిట్, అరబిక్, పెర్షియన్ సబ్జెక్ట్ |
ఏప్రిల్ 08 | ఒకేషనల్ పరీక్షలు |