అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన సోనూసూద్..!

కరోనా కాలంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ మరో అడుగు ముందుకేశారు. సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ ఏరియాలో అంబులెన్స్ సర్వీస్ స్టార్ట్ చేశారు. రానున్న రోజుల్లో వీటిని మరింతగా విస్తృతం చేస్తామని సోనూసూద్ తెలిపారు. 

 ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ప్రమాదవశాత్తు మరణించి, ఆత్మహత్య చేసుకున్న వారి మృతదేహాలను వెలికితీస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన శవాల శివను సోనూసూద్ అభినందించారు. ప్రజలు ఇచ్చిన విరాళాలతో అంబులెన్స్ కొనుగోలు చేసిన శివ.. దానికి ‘సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్’ అని పేరు పెట్టాడు. ఈ అంబులెన్స్ ప్రారంభోత్సవానికి రావాలని సోనూసూద్ ను కోరగా.. సోనూసూద్ శివ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు. ఇక ఈ అంబులెన్స్ సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు. 

 

Leave a Comment