సోనూసూద్ మరో గొప్ప కార్యక్రమం.. ‘సంభవం’ పేరుతో ఉచిత ఐఏఎస్ కోచింగ్..

కరోనా లాక్ డౌన్ లో ఎంతో మందిని ఆదుకున్న రియల్ హీరో సోనూసూద్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆక్సిజన్ అవసరమైన కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. తాజాగా మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. 

ఐఏఎస్ కావాలని ఆశతో ఉండేవారికి సోనూసూద్ అండగా నిలవనున్నాడు. ఇందులో భాగంగా ‘సంభవం’ పేరుతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

‘ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా.. మీ బాధ్యత మేం తీసుకుంటాం. ‘సంభవం’ ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్ గా ఉంది’ అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐఏఎస్ కావాలనుకుని, కోచింగ్ తీసుకోవడానికి ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు ప్రోత్సాహకంగా వారికి స్కాలర్ షిప్స్ అందించబోతున్నట్లు ప్రకటించారు. స్కాలర్ షిప్ కోసం www.soodcharityfoundation.org వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని సోనూసూద్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

Leave a Comment