విద్యార్థులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..!

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం అందిరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కూల్స్ అన్ని మూసివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం విద్యార్థులందరూ ఆన్ లౌన్ ద్వారానే పాఠాలు అభ్యసిస్తున్నారు. ఈ తరుణంలో నిరుపేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 9వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. గురుకుల విద్యార్థుల సమస్యలు  పరిష్కరించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ నిర్వహించిన సమావేవంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 విద్యార్థులకు రూ.5వేల నుంచి రూ.6వేల విలువ చేసే స్మార్ట్ ఫోన్లను అందించనున్నారు. సొసైటీ పరిధిలో 60 వేల మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో మిగిలిన విద్యార్థులకు ఆన్ లైన్ విద్యలో ఎటువంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశ్యంతో సొసైటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే విశాఖపట్నంలో రెండు నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను  ఏర్పాటు చేయనున్నారు. 

Leave a Comment