పీఎఫ్ ఖాతాదారులకు షాక్..!

పీఎఫ్ వడ్డీ రేటు కోత

ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతానికి (15 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయించింది. పీఎఫ్ వడ్డీ రేటు కుదింపుపై గురువారం సమావేశమైన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ)
ఈ తుది నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతంగా ఉంచినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్యర్ వెల్లడించారు. పీఎఫ్ వడ్డీ రేటు కోతపై కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఈపీఎఫ్ వోలోని 60 మిలియన్ల ఖాతాదారులకు ప్రభావితం చేయనుంది. 

(EPFO ఎగ్జిట్ డేట్ అప్ డేట్ చేయడం ఎలా ?)

 

Leave a Comment